పాకిస్తాన్కు చెందిన ఐసీసీ మాజీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ అసద్ రవూఫ్ లాహోర్లో గుండెపోటుతో మరణించారు. అసద్ రవూఫ్ వయస్సు 66 సంవత్సరాలు. పాకిస్తాన్ యొక్క అత్యంత ప్రముఖ అంపైర్ లలో ఒకడుగా ఉన్న రవూఫ్ 2006లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్కు ఎంపిక అయ్యాడు. రవూఫ్ మొత్తం 64 టెస్టుల్లో అంపైర్ గా ఉండగా, అందులో 49 టెస్టుల్లో ఆన్-ఫీల్డ్ అంపైర్గా, 15 టెస్టులకు టీవీ అంపైర్గా ఉన్నాడు. ఇక 98 వన్డేలు, 28 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లకు కూడా అంపైర్గా పనిచేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కూడా పలు మ్యాచ్ లకు రవూఫ్ అంపైర్ బాధ్యతలను నిర్వర్తించాడు.
ఇక ఐపీఎల్ 2013 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో రవూఫ్ పేరు రావడంతో అతని కెరీర్ పతనమైంది. అదే ఏడాది ఆయన పనితీరుపై వార్షిక సమీక్ష తర్వాత ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్ల జాబితా నుండి తొలగించారు. ఇక 2016లో అవినీతి, దుష్ప్రవర్తన ఆరోపణలపై బీసీసీఐ కూడా రవూఫ్పై ఐదేళ్లపాటు నిషేధం విధించడంతో పూర్తిగా అంపైర్ విధుల నుంచి తప్పుకున్నాడు. అంపైర్ అసద్ రవూఫ్ మృతిపట్ల పలువురు అంపైర్లు, క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY