ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికయ్యారు. కాగా వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. మూడోరోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం తరపున పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో బదులిచ్చారు. అనంతరం స్పీకర్ తమ్మినేని డిప్యూటీ స్పీకర్ ఎన్నికను చేపట్టారు. అయితే ఈ ఎన్నికకు కోలగట్ల వీరభద్రస్వామి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు స్పీకర్ ప్రకటించారు.
ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయిన కోలగట్ల వీరభద్రస్వామిని సీఎం జగన్, టిడిఎల్పీ అచ్చెన్నాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు సభాపతి స్థానానికి సగౌరవంగా తోడ్కొని వెళ్లారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కోలగట్లకు మర్యాదపూర్వకంగా ఛైర్ లోకి స్వాగతం పలికారు. ఇక ఏకగ్రీవంగా ఎన్నికయిన డిప్యూటీ స్పీకర్ను అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అభినందించారు. కాగా గత గురువారం కోన రఘుపతి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో మిగిలిన పదవీ కాలానికి కోలగట్ల వీరభద్రస్వామి పదవిలో కొనసాగనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY