సాహితీ సృజనకారుల ఆత్మబంధువు, సాహితీవేత్త నిజాం వెంకటేశం మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పేదరికంలో వున్న తెలంగాణ రచయితలు, కవుల బాగోగులను కనిపెట్టుకుంటూ, వారికి చేదోడువాదోడుగా వుంటూ, తెలంగాణ సాహిత్యం పట్ల వెంకటేశం కనబరిచిన ఆత్మీయతానుబంధం గొప్పదని సీఎం అన్నారు. నిజాం వెంకటేశం మరణం సాహిత్య రంగానికి తీరని లోటని అన్నారు. నిజాం వెంకటేశం కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సాహితీవేత్త నిజాం వెంకటేశం ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు సాహితీ లోకానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇక నిజాం వెంకటేశం అంత్యక్రియలు మంగళవారం జరుగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY