దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి తగ్గుముఖం దిశగా వెళ్తుంది. గత 24 గంటల్లో 5 వేలలోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 4,858 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 19, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,39,046 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 2.76 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 18 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,28,355 కి పెరిగింది. ఇక సెప్టెంబర్ 18, ఆదివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 89.17 (89,17,53,120) కోట్లకు చేరుకుంది. గత 24 గంటల్లో 1,75,935 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
దేశంలో 48,027 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.71 శాతం:
దేశంలో ప్రస్తుతం 48,027 (0.11%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 4,735 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,39,62,664 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.71 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY