ఆసియా కప్ 2023 వేదికపై భారతదేశం మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ దీనిపై స్పందించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారిక ప్రకటనపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాగా ఇటీవల బీసీసీఐ సెక్రటరీ జై షా, 2023 ఆసియా కప్ కోసం భారతదేశం పాకిస్తాన్కు వెళ్లదని, ఈ టోర్నమెంట్ తటస్థ వేదికపై జరుగుతుందని అన్నారు. దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విరుచుకుపడ్డారు. అలాగే పీసీబీ కూడా 2023 వన్డే ప్రపంచ కప్ నుండి వైదొలుగుతామని బెదిరించింది. ఈ పరిణామాల క్రమంలోనే అనురాగ్ ఠాకూర్ స్పందించారు.
‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ ప్రకటన సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచంలో భారతదేశం ఒక క్రీడా శక్తి కేంద్రం అని, ఏ క్రీడలోనైనా భారతదేశాన్ని విస్మరించలేరని పేర్కొన్నారు. గతంలో ఇక్కడ అనేక ప్రపంచ కప్లు నిర్వహించబడ్డాయని తెలిపిన ఠాకూర్, ఈ క్రమంలో వచ్చే ఏడాది ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరగనున్నట్లు గుర్తు చేశారు. దీనిలో క్రికెట్ ఆడే అన్ని పెద్ద జట్లు ఇందులో పాల్గొంటాయని, పాకిస్థాన్ కూడా ఖచ్చితంగా ఆడుతుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్లో భద్రతా సమస్యలు ఉన్నందున హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని, దీనిపై చర్చ అనవసరమని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY