దేశంలో మరో 492 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు ఎంతంటే?

India New Corona Positive Cases Updates on November 20th,India Records 492 New Covid Cases, Covid Deaths Nov 4th, Mango News, Mango News Telugu, India Logs 492 Covid Positive Cases, 492 New COVID19 Cases In Telangana, COVID19 Cases In India, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, India COVID News,India COVID,COVID

దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 500 లోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 492 పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. దీంతో నవంబర్ 20, ఆదివారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,69,015కు, మరణాల సంఖ్య 5,30,574కి పెరిగింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 1,92,665 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.26 శాతంగా నమోదైంది.

అలాగే మరో 781 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,31,952 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 6,489 (0.01%) మంది చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE