దేశంలో మరో 197 మందికి కరోనా పాజిటివ్, 220.15 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ

India Records 197 Covid-19 Positive Cases Covid Vaccination Coverage Crosses 220.15 Cr,Covid Deaths,Covid Last 24 Hours, 197 People Tested Positive,Coronavirus In India,Mango News,Mango News Telugu,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,583కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ (73), కర్ణాటక (45), మహారాష్ట్ర (21), తెలంగాణ (10) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే మరో 229 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,47,551 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.80 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.

మరోవైపు కరోనా వలన మరో మరణం (కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,723కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య 2,309 (0.01%) కు చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా జనవరి 12, గురువారం ఉదయం 8 గంటల వరకు 220.15 కోట్లకుపైగా (2,20,15,76,369) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయి. ముందు రోజున 61,680 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + two =