తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 60 లక్షల మంది రైతులకు ‘రైతుబంధు’ పథకం కింద రూ.65 వేల కోట్ల సాయం అందించామని తెలిపారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఆయన శనివారం నిజామాబాద్ పట్టణంలో కాకతీయ స్యాండ్ బాక్స్ ఆధ్వర్యంలో జరిగిన రైతులు మరియు స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీల ఏర్పాటును ఆహ్వానిస్తున్నామని, దీనికి సహకారం అందించడానికి టెక్నాలజీ ఫర్ ఇంప్యాక్ట్ పేరుతో స్యాండ్ బాక్స్ సంస్థ ముందుకు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఐటీ పరిశ్రమను విస్తరిస్తున్నామని, దీనిలో భాగంగా ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్షన్ అందించడానికి ప్రణాళికలు రూపొందించామని వివరించారు.
ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని కేవలం నాలుగేళ్ల సమయంలోనే నిర్మించామని, దీనిద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, అలాగే లక్ష కిలోమీటర్ల పైప్లైన్ వేసి కోటి ఇళ్లకు మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి దాదాపు 46 వేల చెరువులను పునరుద్ధరించామని, వీటిద్వారా పరిసర గ్రామాలకు సమృద్ధిగా త్రాగునీరు, సాగునీరు అందుతోందని వెల్లడించారు. రైతులకు ఉచిత విద్యుత్ సహా పలు విధాలుగా చేయూతనివ్వడం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు అందించి ప్రోత్సహిస్తోందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE