ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (జనవరి 28, శనివారం) సాయంత్రం 5:45 గంటలకు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో జరగనున్న వార్షిక నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సంవత్సరం, ఎన్సీసీ ప్రారంభించి 75వ సంవత్సరాన్ని జరుపుకుంటోంది. ఈ కార్యక్రమంలో, ప్రధాని మోదీ స్పెషల్ డే కవర్ను మరియు 75 విజయవంతమైన ఎన్సీసీ సంవత్సరాలను స్మరించుకునేలా, స్మారకంగా ప్రత్యేకంగా ముద్రించిన రూ.75 విలువ కలిగిన నాణేన్ని విడుదల చేయనున్నారు.
ఈ ర్యాలీ హైబ్రిడ్ డే అండ్ నైట్ ఈవెంట్గా నిర్వహించబడుతుంది మరియు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ థీమ్పై సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. అలాగే వసుధైవ కుటుంబకం యొక్క నిజమైన భారతీయ స్ఫూర్తితో 19 విదేశీ దేశాల నుండి 196 మంది అధికారులు మరియు క్యాడెట్లు ఈ వేడుకల్లో భాగం కావడానికి ఆహ్వానించబడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE