ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ పరీక్షలో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఇవ్వడానికి నిర్ణయించుకుంది. కాగా 2020-21 మరియు 2021-22 విద్యాసంవత్సరాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించలేదు. కరోనా మహమ్మారి కారణంగా ఆ రెండు సంవత్సరాలు తరగతులు జరగని కారణంగా విద్యార్థులు పరీక్ష రాయలేదు. దీంతో రెండేళ్లు ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించారు. అయితే 2023-34 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయడంతో ఈ ఏడాది మళ్ళీ వెయిటేజీ ప్రకటించారు. అలాగే గతేడాది ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు సిలబస్లో కేవలం 70% మాత్రమే చదివిన నేపథ్యంలో ఈఏపీసెట్లో కూడా అంతవరకే ప్రశ్నలు ఇవ్వాలని నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE