ఎన్నికలుంటే ఒకమాట, లేకుంటే మరోమాట చెప్పడం వైసీపీ నైజం కాదని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం ఆయన ఏపీ సచివాలయం మీడియా పాయింట్ వద్ద దీని గురించి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విషయం కోర్టుల పరిధిలో ఉన్నందున ప్రభుత్వ విధానాలను మాత్రమే స్పష్టం చేస్తానని, దీనిపై వివాదం చేయడం తగదని అన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రకటించినట్లు ఏపీలో పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలనేదే తమ అభిమతమని, అందుకే మూడు ప్రాంతాలలో మూడు రాజధానులను పెడుతున్నామని తెలిపారు. అమరావతిలో ఇప్పటికే నిర్మాణం జరిగినందున అసెంబ్లీ అక్కడే ఉంటుందని, విశాఖలో పరిపాలన రాజధాని మరియు కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.
ఇంకా సజ్జల మాట్లాడుతూ.. అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రజలలో లేనిపోని అపోహలు కల్పిస్తున్నాయని, కావాలనే అయోమయం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార వికేంద్రీకరణ చేయాలని నాడు విభజన సమయంలో శివరామకృష్ణ కమిటీ సూచించిందని, అయితే నాడు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దానిని పెడచెవిన పెట్టారని అన్నారు. అప్పుడు చంద్రబాబు చేసిన పొరపాటును సీఎం జగన్ ఇప్పుడు సరిచేయాలని అనుకుంటున్నారని, ఆయన నిర్ణయానికి రాష్ట్ర ప్రజల మద్దతు కూడా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల కోసం రాజకీయ చేయడం వైసీపీ నైజం కాదని, అందుకే ఎన్నికలుంటే ఒకమాట, లేకుంటే మరోమాట చెప్పమని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE