తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 2000 మంది ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు డిజిటల్ ట్యాబ్లను అందజేశారు. గతంలో సిరిసిల్ల పట్టణంలో 1000 విద్యార్థులకు డిజిటల్ ట్యాబ్లను అందజేయగా, నేడు ఎల్లారెడ్డిపేట మండలంలో మరో 2000 మంది విద్యార్థులకు మంత్రి కేటీఆర్ ట్యాబ్లను అందజేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, పంపిణీ చేసిన ట్యాబ్స్ ను సమర్థవంతంగా చదువుల కోసం ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
చక్కగా చదువుకుని ఐఐటీ, నీట్ ఎంట్రెన్స్ లతో పాటుగా ఇతర పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాలన్నారు. అలాగే వేములవాడ నియోజకవర్గానికి కూడా 3 వేల ట్యాబ్లు అందిస్తామని చెప్పారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వృద్ధుల సంరక్షణ కోసం రూ.41 లక్షలతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన డే కేర్ సెంటర్ ను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE