వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి బలవన్మరణం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం డాక్టర్ ప్రీతి తల్లిదండ్రులు నరేందర్, శారదలకు బహిరంగ లేఖ రాశారు. ఇక దీనిని తన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించిన ఆమె, అందులో ఇలా పేర్కొన్నారు.. ఒక తల్లిగా ప్రీతి మరణం నన్ను చాలా బాధించింది. ఆమె కోలుకోవాలని ప్రార్థించిన కోట్లాది మందిలో నేనూ ఒకరిని. చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల కలిగిన ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరం. సమాజం ఒక గొప్ప వైద్యురాలిని కోల్పోయింది. దీనిని జీర్ణించుకోలేకపోతున్నాను. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటాం. రాష్ట్రం మొత్తం మీకు అండగా ఉంటుంది. ఈ కష్టకాలంలో మీ ఇద్దరికీ బలాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఇది. మీ కుటుంబానికి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు పార్టీ అండగా ఉంటుంది. ఈ సందర్భంగా నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
డాక్టర్ ప్రీతి తల్లితండ్రులకు నా లేఖ pic.twitter.com/SsIQimvQdP
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 28, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE