నవంబర్ 12న తెలంగాణలోని రామగుండంలో ప్రధాని మోదీ పర్యటన, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

CS Somesh Kumar held Review on Arrangements for PM Modi Tour to Ramagundam on NOV 12, Review on Arrangements for PM Modi Tour to Ramagundam on NOV 12, PM Modi Tour to Ramagundam on NOV 12, PM Modi Visit to Ramagundam on NOV 12, CS Somesh Kumar held Review, CS Somesh holds meet over PM Modi's visit, Telangana Chief Secretary Somesh Kumar, Prime Minister Narendra Modi, Telangana Chief Secretary, PM Modi Ramagundam Tour News, PM Modi Ramagundam Tour Latest News And Updates, PM Modi Ramagundam Tour Live Updates, PM Modi Twitter News, PM Modi Latest News, Mango News, Mango News Telugu

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 12వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ రామగుండంలో పర్యటించి, ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 12న రామగుండంలో జరిగే ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, దక్షణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ సీఈవో ఏ.కె జైన్ లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. వేదికల వద్ద తగిన బందోబస్తు, శాంతి భద్రతలు, బందోబస్తు తదితర ఏర్పాట్లను బ్లూబుక్ ప్రకారం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఫైర్ సర్వీసుల ఐజీ సంజయ్ జైన్, రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి, పెద్దపల్లి కలెక్టర్ సంగీత సత్యనారాయణ, తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 5 =