ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఉదయం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు ధైర్యంగా ఉండమని చెప్తూ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్వీట్ చేస్తూ “కవితమ్మా…ధైర్యంగా ఉండండి. పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడతాయి. అంత మాత్రాన వేట ఆపుతామా?, కేసీఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరం మీ ధర్మపోరాటంలో మీతోపాటు ఉన్నాము. ఉంటాము కూడా. ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే. మనదే” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE