ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. వచ్చేనెల 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది. 2022 సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు జరుపనున్నట్లు ప్రకటించడంతో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను జూన్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. కాగా యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకు రాష్ట్రం నుంచి 25 మంది గ్రూప్-1 అభ్యర్థులు హాజరవనున్నారు. ఈ ఇంటర్వ్యూలకు హాజరవుతున్న అభ్యర్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని మెయిన్స్ పరీక్ష వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జూన్ 3 నుంచి 9 వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE