ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మార్చి 27, సోమవారం నాడు గ్రూప్-4 మెయిన్స్ హాల్ టికెట్స్ ను విడుదల చేసింది. 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్ 4) పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ కోసం కోసం 2021, డిసెంబర్ 28న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ముందుగా గ్రూప్ 4 ప్రిలిమినరీ పరీక్షకు 2,11,341 మంది అభ్యర్థులు హాజరవగా, మెయిన్ పరీక్షకు మొత్తం 11,574 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
గ్రూప్ 4 మెయిన్ పరీక్షను ఏప్రిల్ 4వ తేదీన ఏపీపీఎస్సీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించనుంది. ఏప్రిల్ 4న ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్లలో గ్రూప్ 4 మెయిన్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షకు అర్హతపొందిన అభ్యర్థులందరూ ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/ ద్వారా అడ్మిట్ కార్డ్/హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE