తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. కల్యాణిపై తప్పుడు కేసు పెట్టడమే కాకుండా బెడ్ రూంలోకి చొరబడి తీవ్రవాదిలా అరెస్ట్ చేసిన తీరు దారుణమని, వైకాపా ప్రభుత్వ అకృత్యాలను ప్రశ్నించిన మహిళపై హత్యానేరం కేసు పెట్టడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా దీనిపై స్పందించిన చంద్రబాబు నాయుడు, మూల్పూరి కళ్యాణిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్పూరి సాయి కళ్యాణి పై తప్పుడు కేసు పెట్టిందే కాక…. బెడ్ రూంలోకి చొరబడి ఆమెను ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణం. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్యాయత్నం కింద కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు! @APPOLICE100 pic.twitter.com/MSpqkQ8uJh
— N Chandrababu Naidu (@ncbn) April 10, 2023
మరోవైపు యువగళం పాదయాత్రలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా దీనిపై స్పందించారు. తెలుగు మహిళా నేత మూల్పూరి సాయి కళ్యాణిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్టర్ సాక్షిగా చెప్పారు. ఓ మహిళ పట్ల పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించి వ్యవస్థకే మచ్చ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల మెప్పు కోసం కళ్యాణిపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. కల్యాణికి టీడీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన లోకేష్, మహిళలని చూడకుండా వేధిస్తున్న ప్రతీ ఒక్కరూ చట్టం ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE