కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చ్ 24 తర్వాత లాక్డౌన్ మొదలయ్యాక ఇప్పటికే మూడు విడతల్లో ఉచిత రేషన్ అందించారు. కాగా ఈ రోజు (మే 16, శనివారం) నుంచి ఏపీలో నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. రేషన్ కార్డులో నమోదైన ఒక్కో మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ శనగలు అందజేస్తున్నారు.
రాష్ట్రంలో గల మొత్తం 28,354 రేషన్ దుకాణాల ద్వారా ఈ పంపీణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా ముందుగానే కేటాయించిన సమయంలో వచ్చే విధంగా కూపన్లు అందజేస్తున్నారు. రేషన్ కార్డుదారులకు బయో మెట్రిక్ తప్పనిసరి చేయడంతో అన్ని రేషన్ దుకాణాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ రేషన్ ఉచిత పంపిణీ ద్వారా రాష్ట్రంలో మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu