తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి నెలరోజులు పూర్తయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నెలరోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ ముందుకెళ్తున్నారు. విమర్శలకు తావే లేకుండా.. ఎవరూ వేలెత్తి చూపకుండా.. అంచనాలకు కూడా అందకుండా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. కీలక అంశాల్లో తానక్కడే అన్నట్లు కాకుండా.. అందరు కలిసి కట్టుగా ఉండాలన్న సంకేతాన్ని ఇచ్చేలా రేవంత్ రెడ్డి ప్రతినిర్ణయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక రేవంత్ రెడ్డి ముందున్న అతిపెద్ద సవాల్ ఆరు గ్యారెంటీలను అమలు చేయడం. 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అటు లోక్ సభ ఎన్నికల గడువు కూడా దగ్గరపడుతోంది. ఈలోగానే ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల అమలు కోసం అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఊహించినదానికంటే పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలించి అర్హులను అధికారులు ఎంపిక చేస్తున్నారు.
అయితే ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి ఇటీవల నిర్వహించిన రివ్యూలో రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఛైర్మన్గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నియమించారు. అలాగే ఆ కమిటీలో సభ్యులుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులను రేవంత్ రెడ్డి నియమించారు. ఆరు గ్యారెంటీల అమలు పారదర్శకంగా జరిగేందుకు తీసుకుంటున్న జాగ్రత్తల్లో భాగంగా ఈ కమిటీని రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ ఏర్పాటుపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పారదర్శకంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని.. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం హామీలు అందిస్తామని అన్నారు. ప్రజాపాలనలో 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. త్వరలో దరఖాస్తులను పరిశీలించి.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE