తాజాగా లాక్డౌన్ సడలింపులలో భాగంగా మున్సిపల్ కార్పోరేషన్స్, మున్సిపాలిటీల పరిధిలో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో రిజిస్టర్ అయినా దుకాణాలను తెరిచేందుకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ అనుమతుల్లో భాగంగా లిక్కర్, బార్బర్ షాపులు, సెలూన్స్, రెస్టారెంట్స్ కూడా తెరుస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ వివరణ ఇచ్చారు.
ఈ రోజు ఇచ్చిన అనుమతులు కేవలం వస్తువులను అమ్మే షాపులకు మాత్రమేనని, బార్బర్ షాపులు, సెలూన్స్, రెస్టారెంట్స్ తెరిచేందుకు ఎలాంటి అనుమతి లేదని చెప్పారు. అలాగే మద్యం దుకాణాలకు తెరిచేందుకు కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో షాపులు తెరుచుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని హాట్ స్పాట్, కంటైన్మెంట్ జోన్స్ లలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో వస్తువులను అమ్మే దుకాణాలు తెరిచేందుకు అనుమతినిచ్చినట్టు ఆమె తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]