తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి సువేందు అధికారి శనివారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయన గురువారం నాడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు మిడ్నాపూర్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో సువేందు అధికారి కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఎంసీ అధినేత, సీఎం మమతా బెనర్జీపై పలు విమర్శలు చేశారు. గౌరవం లేని చోట రాజీపడుతూ తాను ఉండలేనని, అందువలనే టీఎంసీని వీడినట్టు తెలిపారు.
అమిత్ షాతో తనకు చాలా కాలం అనుబంధం ఉందన్నారు. కరోనా బారిన పడినప్పుడు టీఎంసీ నుండి ఎవరూ పరామర్శించలేదని, కానీ అమిత్ షా రెండుసార్లు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి వాకబు చేశారని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని సువేందు ధీమా వ్యక్తం చేశారు. సువేందు అధికారితో పాటుగా తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. టీఎంసీ ఎంపీ సునీల్ మొండల్, మాజీ ఎంపీ దాసరత్ తిర్కీ కూడా ఈ రోజు బీజేపీ పార్టీలో చేరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ