ప్రముఖ నటుడు విక్రమ్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో అసౌకర్యం కారణంగా ఆయన శుక్రవారం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు నిపుణులైన వైద్యుల బృందం చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే విక్రమ్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు సమాచారం. గతేడాది డిసెంబర్ లోనే నటుడు విక్రమ్ కరోనా బారినపడి కోలుకున్నారు. అయితే విక్రమ్ ఆరోగ్యంపై కుటుంబసభ్యులు లేదా సన్నిహితులు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు చెన్నైలో జరగాల్సిన తన రాబోయే చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో విక్రమ్ పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో నటుడు విక్రమ్ హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యాయని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY