ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) ను కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ బృందం ఏప్రిల్ 27, సోమవారం సాయంత్రం గాంధీ హాస్పిటల్ను సందర్శించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, ఇతర విభాగాల వైద్యాధికారులతో సమావేశమైంది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినా వారికీ అందిస్తున్న వైద్యసేవలు, వసతులు, అందుబాటులో వున్న శానిటేషన్, పారామెడికల్, సిబ్బంది, సెక్యూరిటీ, వార్డు బాయ్స్ పనితీరు, పీపీఈలు, మెడిసిన్స్ లభ్యత వివరాలు తెలుసుకున్నారు.
గాంధీ హాస్పిటల్ లో వున్న బెడ్స్, ఐసియు బెడ్స్, వెంటిలేటర్లు తదితర అంశాలను వాకబు చేశారు. వైద్యులు, ఇతర సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ చికిత్స పొందుతున్న కేసులలో 90% మంది ఆరోగ్య స్థితి నార్మల్ గానే ఉన్నట్లు వివరించారు. ఎలాంటి సిబ్బంది కొరత లేదని తెలిపారు. అనంతరం గాంధీ హాస్పిటల్లో ఏర్పాటుచేసిన కోవిడ్-19 ప్రత్యేక వార్డును తనిఖీ చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను కేంద్ర బృందం ప్రశంసించింది. ఇక్కడ అందిస్తున్న సేవలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తాయని కేంద్ర బృందం సభ్యులు అభిప్రాయపడ్డారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]