కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మార్చ్ 24 నుంచి ఏప్రిల్ 14 వరకు మొదటి విడత, అనంతరం మే 3 వ తేదీవరకు రెండవ విడత లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ నేపథ్యంలో కోర్టుల్లో పలు కార్యకలాపాలు స్తంభించిపోవడంతో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ఏప్రిల్ 28, బుధవారం నాడు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు, జిల్లా కోర్టులు, ఇతర కోర్టులు మరియు ట్రైబ్యునళ్లకు వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu