ఈ యాసంగిలో ఇప్పటివరకు 6057 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.86 లక్షల మంది రైతుల నుంచి రూ.5,223 కోట్ల విలువైన 28.48 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కొనుగోళ్ళకు సంబంధించి రూ.2378 కోట్లను రైతుల ఖాతాలో జమచేసినట్టు తెలిపారు. అలాగే రైతుల నుంచి సేకరించిన 28.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 26.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టం మిల్లింగ్(సీఎంఆర్) కోసం రైసు మిల్లులకు తరలించడం జరిగిందని చెప్పారు. మే 5, మంగళవారం నాడు 1.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, రైతుల ఖాతాలో రూ.249 కోట్లను జమ చేయడం జరిగిందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu