కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షలతో పాటు, విద్యా రంగ కార్యకలాపాలు నిలిపివేసి పాఠశాలలను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను, తదుపరి తరగతులకు ప్రమోట్ చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులను పై తరగతులకు పంపిస్తునట్టు ప్రకటించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ దృష్ట్యా రాష్ట్ర కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు విద్యార్థులను ప్రమోట్ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu