కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక సంవత్సరం పాటు తన వేతనాన్ని 30 శాతం తగ్గించుకుంటు నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రపతి భవన్లో పలు రకాల పొదుపు చర్యలను పాటించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. రాష్ట్రపతి భవన్ లో ప్రతిపాదించిన పొదుపు చర్యల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 20 శాతం ఆదా అవుతుందని చెప్పారు. ఇలా సమకూరే మొత్తం నగదును కోవిడ్-19(కరోనా వైరస్)పై పోరుకు ఉపయోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇప్పటికే మార్చి నెల పూర్తి వేతానాన్ని పీఎం-కేర్స్ ఫండ్కు విరాళం అందజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu