కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం వలన మార్చి నెలాఖరులో జరగాల్సిన పదో తరగతి పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ ఎస్ఎస్సీ బోర్డు ఈ రోజు పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది. జూలై 10 వ తేదీ నుంచి పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు పదో తరగతిలో 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇప్పుడు 6 పేపర్లకు కుదించారు. దీంతో ప్రతి సబ్జెక్ట్కు ఒక్కో పేపర్ మాత్రమే పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు వెల్లడించింది. అలాగే ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని బోర్డు పేర్కొంది.
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్:
- జూలై 10 – ఫస్ట్ లాంగ్వేజ్
- జూలై 11 -సెకండ్ లాంగ్వేజ్
- జూలై 12 – థర్జ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
- జూలై 13 – గణితం
- జూలై 14 – సామాన్య శాస్త్రం
- జూలై 15 – సాంఘిక శాస్త్రం
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu