కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడం వలన వివిధ రాష్ట్రాల్లో ఉండిపోయిన ప్రజలను ఏపీకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి ఏపీకి మే 16 నుండి బస్సులు నడిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ నిబంధనలు పాటించే వారికే ఆయా బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించనున్నారు.
ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయాణానికి అవకాశం ఇవ్వనున్నారు. అలాగే వారి స్వస్థలాలకు చేరుకున్నాక సంబంధిత జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లో ఉండేందుకు అంగీకారం తెలిపితేనే ఈ బస్సుల్లో ప్రయాణానికి టికెట్లు జారీ చేయనున్నారు. ఈ నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేసి, మే 16వ తేదీ నుండి హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు నడపనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu