ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కు చేరుకుంది. గడిచిన 12 గంటల్లోనే కొత్తగా 17 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మార్చ్ 30 , సోమవారం రాత్రి 164 మందికి కరోనా పరీక్షలు చేయగా, 17 మందికి కరోనా పాజిటివ్గా తేలిందని పేర్కొన్నారు. అయితే బాధితుల్లో ఎక్కువగా ఢిల్లీలో మత పరమైన ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారే ఉన్నారని బులెటిన్ లో తెలిపారు. ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11 కేసులు నమోదు కాగా, గుంటూరులో 9, విశాఖపట్నంలో 6, కృష్ణా జిల్లాలో 5, తూర్పుగోదావరిలో 4, అనంతపురంలో 2, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జిలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.
Home ఆంధ్ర ప్రదేశ్
- Advertisement -