తిరుమల తిరుపతి దేవస్థానంలో తాజాగా మరో కలకలం చెలరేగింది. శ్రీవారి ఆభరణాలు చోరీకి గురైనట్టు టీటీడీ అధికారులు గుర్తించారు. టీటీడీ ట్రెజరీ నుంచి 5 కేజీల వెండి కీరిటంతో పాటు 2 బంగారు ఉంగరాలు మరియు చైన్ కూడ మాయమైనట్టు తెలుస్తుంది. అయితే 2018 లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన టీటీడీ అధికారులు ఏఈవో శ్రీనివాసులను బాధ్యుడిగా గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. విచారణ అనంతరం ఆభరణాల విలువను ఏఈవో శ్రీనివాసులు జీతం నుంచి రికవరీ చేయాలనీ నిర్ణయించారు. ఈ విధానంలో శ్రీనివాసులు జీతం నుంచి ప్రతినెల రూ. 30 వేలు రికవరీ చేయనున్నట్టు తెలిపారు. అయితే జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకుండా, ఇలా రికవరీ చేయడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
[subscribe]
[youtube_video videoid=9ykw6HFXzOU]