ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు సోమవారం రాజ్భవన్కు వెళ్లిన సీఎం జగన్ గవర్నర్ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వీరిరువురూ దాదాపు గంట 15 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. భేటీలో భాగంగా.. సీఎం జగన్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై గవర్నర్కు వివరించినట్లు తెలుస్తోంది. అలాగే విశాఖపట్నం వేదికగా మంగళవారం జరుగనున్న జీ-20 ప్రతినిధుల సమావేశం గురించి కూడా గవర్నర్ నజీర్కు తెలియజేసినట్లు సమాచారం. వీటితో పాటుగా రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి జగన్ గవర్నర్కు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీ అనంతరం సీఎం జగన్ రాజ్భవన్ నుంచి తాడేపల్లి బయల్దేరి వెళ్లారు. కాగా నేడు విశాఖలో జరిగే జీ-20 సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ సహా పలువురు కేంద్ర మంత్రులు సైతం హాజరవుతున్నారు. ఇక ఈ సదస్సు నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE