ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ నెంబర్వన్ స్థానంలో నిలిచింది. కేంద్ర ఆర్థిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు 4 వ ఎడిషన్ రాష్ట్రాల బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ర్యాకింగ్స్ ను ప్రకటించారు. మార్చి 31, 2019 వరకు రాష్ట్రాలు అమలుచేసిన సంస్కరణలను పరిగణనలోకి తీసుకోని కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్ లో ఏపీ మొదటి స్థానంలో నిలువగా, రెండోస్థానంలో ఉత్తర ప్రదేశ్ మరియు మూడోస్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. తొలిమూడు స్థానాలలో నిలిచిన రాష్ట్రాలకు మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. అలాగే ఈ రోజు విడుదల చేసిన ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ రాష్ట్రాలు చేసిన ప్రయత్నాలకు ప్రతిబింబమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు.
మొదటి పది రాష్ట్రాల బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ర్యాకింగ్స్ – 2019:
- ఆంధ్రప్రదేశ్: ర్యాంక్-1
- ఉత్తర ప్రదేశ్: ర్యాంక్-2
- తెలంగాణ: ర్యాంక్-3
- మధ్యప్రదేశ్: ర్యాంక్-4
- జార్ఖండ్: ర్యాంక్-5
- ఛత్తీస్ గడ్: ర్యాంక్-6
- హిమాచల్ ప్రదేశ్: ర్యాంక్-7
- రాజస్థాన్: ర్యాంక్-8
- పశ్చిమ బెంగాల్: ర్యాంక్-9
- గుజరాత్: ర్యాంక్-10
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu