ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. మొత్తం 13 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ జూలై 14, బుధవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ ఎస్పీగా వకుల్ జిందాల్ ను, పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా రాహుల్ దేవ్ శర్మను నియమించారు. అలాగే డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా నారాయణ్ నాయక్ కు ఆదేశాలు ఇచ్చారు.
ఏపీలో జరిగిన ఐపీఎస్ ల బదిలీల వివరాలు:
- ఇంటెలిజెన్స్ ఎస్పీగా వకుల్ జిందాల్
- పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్దేవ్ శర్మ
- ప్రకాశం జిల్లా ఎస్పీగా మాలికా గార్గ్
- రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి
- విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ (జనరల్ అడ్మిన్) ఎస్పీగా డా.షీమోషి
- మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా అజిత్ వేజెంట్ల
- విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా విక్రాంత్ పాటిల్
- కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా గరుడ్ సుమిత్ సునీల్
- విజయవాడ రైల్వేస్ ఎస్పీగా రాహుల్దేవ్ సింగ్
- ఆక్టోపస్ ఎస్పీగా కోయ ప్రవీణ్
- డీజీపీ ఆఫీస్లో లాండ్ ఆర్డర్ ఏఐజీగా ఆర్ఎన్ అమ్మిరెడ్డి
- విశాఖపట్నం డీసీపీ-1గా గౌతమి శాలి
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ