ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీ జరిగింది. ఐదు జిల్లాల ఎస్పీలు సహా 16 మంది ఐపీఎస్ లను బదిలీచేస్తూ జూలై 6, మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా ఉన్న సిద్దార్థ్ కౌశల్ ను కృష్ణా జిల్లా ఎస్పీగా, కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న ఎం.రవీంద్రనాథ్ బాబును తూర్పుగోదావరి ఎస్పీగా బదిలీ చేశారు. అలాగే విజయనగరం ఎస్పీ బి.రాజకుమారిని దిశ డీఐజీగా నియమించారు.
ఏపీలో జరిగిన ఐపీఎస్ ల బదిలీల వివరాలు:
- దిశ డీఐజీగా బి.రాజకుమారి నియామకం
- విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక
- నెల్లూరు ఎస్పీగా సీహెచ్ విజయరావు
- తూర్పుగోదావరి ఎస్పీగా ఎం.రవీంద్రనాథ్ బాబు
- గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా అద్నాన్ నయీం అస్మీ
- కృష్ణా ఎస్పీగా సిద్దార్థ్ కౌశల్
- గుంటూరు రూరల్ అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా వై.రిషాంత్ రెడ్డి
- స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీగా ఎస్.సతీశ్ కుమార్
- స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీగా వి.విద్యాసాగర్ నాయుడు
- స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ ఎస్పీగా జి.బిందు మాధవ్
- స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ ఎస్పీగా తుహిన్ సిన్హా
- పాడేరు అసిస్టెంట్ ఎస్పీగా పి.జగదీశ్
- చింతూరు అసిస్టెంట్ ఎస్పీగా జి.కృష్ణకాంత్
- నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీగా వీఎన్ మణికంఠ చందోలు
- రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీగా కృష్ణకాంత్ పటేల్
- చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా తుషార్ దూది
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ