ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. జూన్ 1, మంగళవారం నాటికీ రాష్ట్రంలో కోటికి పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసి కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. 75,45,304 మందికి మొదటి డోసు, 25,29,167 మందికి రెండో డోసు కలిపి మొత్తం 1,00,74,471 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా ఇటీవల ఒక్క రోజులోనే 5 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసి దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందజేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ