ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదనపై సీఎం జగన్ సంతకం కూడా చేశారు. ఈ క్రమంలో రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని, ఏపీపీఎస్స్సీ నిర్వహించిన డిపార్టుమెంటల్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ ఈ ప్రొబేషన్ డిక్లరేషన్ వర్తింపజేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో వెలువడొచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే సచివాలయ ఉద్యోగులకు పాత విధానం ప్రకారం జీతాలు ఇవ్వాలని ఆర్థికశాఖ భావించినప్పటికీ ముఖ్యమంత్రి కొత్త పీఆర్సీ ప్రకారం ఇవ్వాల్సిందిగా ఆదేశాలిచ్చారని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఇకపై సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు అందనున్నాయి. కాగా ప్రొబేషన్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు అందనున్నాయని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మంది వరకూ సచివాలయ ఉద్యోగులు ఈ పరీక్షలో పాస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం తాజా నిర్ణయంతో వీరందరికీ లబ్ది కలుగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY