తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు నిలయమైన తెలంగాణ సహజ వనరులతో, నైపుణ్యం కల్గిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
“రాష్ట్ర అవతరణ దినోత్సవ రోజున తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ప్రత్యేకమైన సంస్కృతి మరియు కష్టపడి పనిచేస్తూ అనేక రంగాలలో రాణిస్తున్న వ్యక్తులతో రాష్ట్రం ముందుకెళ్తుంది. తెలంగాణ ప్రజల ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ