ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ 18, గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు నాలుగు లేదా ఐదురోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే సభ ఎన్ని రోజులు జరగాలి, ఏయే అంశాలు చర్చించాలి అనే దానిపై 18న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ