జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో గురువారం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఇటీవలే బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. బద్వేలులో అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేన పార్టీల తరపున బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేసే అంశంపై ఇరువురూ నేతలు చర్చించారు. అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్ కూడా పాల్గొన్నారు. కాగా బద్వేల్ ఉపఎన్నికలో ఉమ్మడి అభ్యర్థి బరిలో నిలపనున్నప్పటికీ, ఏ పార్టీ నుంచి అభ్యర్థిని బరిలో నిలుపనున్నారో త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ