ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1వ తేదీన స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 మరియు అమృత్ 2.0 (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలను దేశంలోని నగరాలన్నింటినీ వ్యర్ధ/చెత్త రహితంగా మరియు నీటి భద్రతగా మార్చాలనే ఆకాంక్షను నెరవేర్చుకేందుకు రూపొందించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ వ్యవహారాల శాఖ మంత్రి, సహాయ మంత్రి, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు కూడా పాల్గొననున్నారు.
స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 ద్వారా అన్ని నగరాలను చెత్త రహితంగా మార్చడం మరియు అమృత్ పథకం కింద కవర్ కానీ నగరాల్లో గ్రే, బ్లాక్ నీటి నిర్వహణ చేపట్టనున్నారు. అన్ని పట్టణ స్థానిక సంస్థలను ఓడిఎఫ్+గా, 1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలను ఓడిఎఫ్++గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 కోసం దాదాపు రూ.1.41 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక అమృత్ 2.0 ద్వారా దాదాపు 4,700 పట్టణ స్థానిక సంస్థల్లో, దాదాపు 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లను అందించి, అన్ని ఇళ్లకు 100% నీటి సరఫరా లక్ష్యంగా పెట్టుకున్నారు. 500 అమృత్ నగరాల్లో 2.64 కోట్ల మురుగు/సెప్టేజ్ కనెక్షన్ల ఏర్పాటు, ఇతర అంశాలతో కలుపుకుని అమృత్ 2.0 కోసం దాదాపు రూ.2.87 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ