ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి సమావేశాలు ముగిసాక సాయంత్రం 4:30 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన గన్నవరం చేరుకోనున్నారు. ఈ క్రమంలో రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారని సమాచారం. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధుల పైన ప్రధానితో చర్చ జరిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. కాగా సీఎం జగన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ వద్ద ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తదితరులతో భేటీ కానున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలను వారికి జగన్ ఇవ్వనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE