దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 754 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 16, గురువారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,92,710 కు చేరుకుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే కరోనా వలన మరో మరణం (కర్ణాటకలో 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,790కి పెరిగింది.
అలాగే మరో 327 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,57,297 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం యాక్టీవ్ కరోనా కేసులు సంఖ్య ప్రస్తుతం 4,623 (0.01%) కి చేరింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 1,01,160 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.75 శాతంగా నమోదైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE