ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుకి సంబంధించి తెలంగాణ బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఆమె వెళ్లకపోవడంతో ఢిల్లీలో కొన్ని గంటలపాటు హైడ్రామా నడిచింది. ఈరోజు విచారణకు తాను రాలేనని కవిత ఈడీ అధికారులకు సమాచారమివ్వడం, దీనికి ఈడీ స్పందించకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ఈడీ అనూహ్యంగా ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న వ్యక్తిగతంగా విచారణకు రావాలంటూ అందులో పేర్కొంది. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఇదే కేసుకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయనను ఈనెల 18న ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపింది. కాగా ఈ కేసులో ఇప్పటికే ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE