అలనాటి సినీ నటి, మాజీ ఎంపీ జమున మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం వేకువజామున హైదరాబాద్లోని స్వగృహంలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో జమున మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేశారు. జమున మృతితో తెలుగు చిత్రసీమలో స్వర్ణయుగానికి తెరపడిందని పేర్కొన్న సీఎం జగన్, ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా నటి జమున తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమెకు 86 సంవత్సరాలు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటితరం నటీమణులలో అగ్రకథానాయకిగా వెలుగొంది తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న జమున గారు మృతి చెందడం బాధాకరం. ఆవిడ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/nDePyrPGri
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 27, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE