ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 2, 3 తేదీలలో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం కడప జిల్లా పర్యటన షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా అక్టోబర్ 2 తేదీ మధ్యాహ్నం సీఎం తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు వెళ్లి, అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. తర్వాత హెలికాఫ్టర్ లో వైఎస్ఆర్ ఎస్టేట్, ఇడుపులపాయలోకి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడ కొద్దిసేపు స్థానిక నాయకులతో మాట్లాడనున్నారు. అనంతరం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఎస్టేట్కు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు.
ఇక అక్టోబర్ 3, ఆదివారం ఉదయం తన మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. పులివెందులలోని లయోలా డిగ్రీ కాలేజీ రోడ్డులో ఉన్న ఈసీ గంగిరెడ్డి సమాధి వద్దకు చేరుకొని సీఎం నివాళులు అర్పిస్తారు. అనంతరం భాకరాపురంలోని ఆడిటోరియంకు చేరుకొని అక్కడ జరిగే ప్రార్థనలో పాల్గొననున్నారు. ఆ తర్వాత భాకరాపురంలోని నివాసానికి సీఎం వెళ్లనున్నారు. ఇక మధ్యాహ్నం 12:05 గంటల నుంచి తిరుగుప్రయాణం ప్రారంభించి, కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ