కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను మే 3 వ తేదీ వరకు పొడిగిస్తునట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. లాక్డౌన్ సమయంలో సామూహిక మత ప్రార్ధనలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. అందులో భాగంగా ఏప్రిల్ 20, సోమవారం నాడు జిల్లా కలెక్టర్లు, ముస్లిం మతపెద్దలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెస్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు.
రంజాన్ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకునేలా అందరికీ వివరించాలని ముస్లిం మత పెద్దలను కోరారు. ఈ ఏడాది ఉగాది, శ్రీరామనవమి పండుగలు, గుడ్ఫ్రైడే, ఈస్టర్ ఇళ్లలోనే చేసుకున్నారని గుర్తుచేశారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని, ఈ పరిస్థితుల్లో అందరికి అర్ధమయ్యేలా తెలియజెప్పాలని కోరారు. నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు సీఎంను కోరగా, ఈ అంశంపై నివేదిక పంపాలని ఆయన కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. అలాగే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu