ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 75 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 25 మందికి, గుంటూరు జిల్లాలో 20, కర్నూల్ లో 16, కృష్ణాలో 5, అనంతపూర్ లో 4, కడపలో 3, తూర్పుగోదావరి జిల్లాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 722 కు పెరిగింది. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 722 పాజిటివ్ కేసులకు గాను 92 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు ఈ వైరస్ వలన 20 మంది మరణించారు. ప్రస్తుతం 610 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏప్రిల్ 19, ఆదివారం నాటికి 858కి చేరిందని, వీరిలో 21 మంది మృతి చెందగా 186 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 651మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu