ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. రాష్ట్రంలో గత మూడు రోజులుగా 10000 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 10171 పాజిటివ్ కేసులు, 89 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 7, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 206960 కు, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 1842 కి చేరింది. మరో 7594 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. గత 24 గంటల్లో 62938 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
కరోనా వలన గత 24 గంటల్లోనే చిత్తూరులో పది మంది, అనంతపూర్ లో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, నెల్లూరులో తొమ్మిది మంది, పశ్చిమగోదావరిలో తొమ్మిది మంది, తూర్పుగోదావరిలో ఏడుగురు, కడపలో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, కృష్ణాలో ఆరుగురు, కర్నూల్ లో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1842 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 7, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 23,62,270
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 206960
- కొత్తగా నమోదైనా కేసులు : 10171
- నమోదైన మరణాలు : 89
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 120464
- యాక్టీవ్ కేసులు : 84654
- మొత్తం మరణాల సంఖ్య : 1842
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu